21, ఫిబ్రవరి 2017, మంగళవారం

29, నవంబర్ 2013, శుక్రవారం

అగ్నికులక్షత్రియ అభ్యుదయ మహాసంఘం ఆవిర్భావం

 యజ్ఞం
 ప్రసంగిస్తున్న శ్రీకోలాబాలాజీగారు




 **అక్ష-2013**
అగ్నికులక్షత్రియ అభ్యుదయ మహాసంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీకమాసవనభోజన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందుగా అనుకున్న విధంగా గన్నవరం వద్ద కాకుండా పటమట ఎన్.ఎస్.ఎం.స్కూలు ఎదురు వీధిలో ఉన్న శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ధ్యానమందిరములో కార్యక్రమము కొనసాగించాము. 40మంది హాజరయిన ఈ కార్యక్రమంలో సంఘం ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను వడుగు నరేష్ వర్మ తన ప్రసంగంలో చర్చించారు. ఆ తర్వాత నేను ఇంకొన్ని వివరాలను జోడించాను. 1901లో ప్రారంభమైన అగ్నికులక్షత్రియ మహాసంఘం ఆ తర్వాత ఏ విధంగా రూపాంతరం చెంది, అసలు లక్ష్యాలకు దూరమైందో అన్న విషయం వివరించాను. There can be a positive result in a wisely handled risk అన్న ఆశావహ దృక్పథంతో నిరంతరం అగ్నికులక్షత్రియుల అభ్యున్నతికి అంకితమయ్యే ఉద్దేశంతో ఉన్న "యువత" నడుంబిగించి ముందుకు కదిలితే లక్ష్యాన్ని ముందుగా చేరుకోవచ్చు.
ముందు యజ్ఞంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాలనుకున్నాము. కానీ ధ్యానమందిరంలో చేయడానికి ఆలయంవారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో యజ్ఞం ఇంటివద్దనే చేశాము. అందరూ ఉంటే బాగుండేది. సుమారు ఒక గంటన్నర సేపు జరిగిన యజ్ఞంయొక్క ప్రాశస్త్యము, ఉపయోగాల గురించి వివరిస్తూ శ్రీతమ్ము యుగంధరవర్మ గారు ఈ యజ్ఞకార్యక్రమాన్ని జరిపించారు. ఆ తర్వాత యజ్ఞప్రసాదాన్ని భోజనాలతోపాటు పంచారు. ఆహూతులతో questionere పూర్తిచేయించారు.
అవనిగడ్డనుండి వచ్చిన శ్రీకోలాబాలాజీగారు విద్యపరంగా అగ్నికులక్షత్రియులకు జరుగుతున్న అన్యాయాలను, ఏ విధంగా చేస్తే వాటిని అధిగమించవచ్చు అన్న అంశాలమీద 40నిముషములపాటు ప్రసంగించారు. ఎన్నో అమూల్యమైన విషయాలను చర్చించారు. ఆ తర్వాత శ్రీకొపనాతి విజయవర్మ, శ్రీపీతా అశ్విన్ కుమార్ తదితరులు ప్రసంగించారు. శ్రీ అశ్విన్ కుమార్ భగవద్గీతకు, రైలుప్రయాణానికి అనుబంధంగా చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
చివరలో ఒక యువకుడు పల్లెకారు అని పిలిపించుకోవడానికి ఏం అభ్యంతరం అని ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇంతకు ముందునుండే అలా పిలిపించుకున్నాం కదా! ఇప్పుడేంటి అభ్యంతరం అన్నది అతని ప్రశ్న. "నిజమే. నిన్నటిదాకా ఏవేవో పేర్లతో పిలుచుకున్నవాళ్ళంతా ఈరోజు ఏదో ఒక "...క్షత్రియ"అని పిలిపించుకుంటున్నారు. మనది పాలకవర్గం... పల్లవవంశానికి చెందినవాళ్ళం... అని నిజమైన చరిత్రను తెలుసుకోండి. అంతేకాని పల్లీలన్నా, పల్లవులన్నా ఒకటే అని (అయితే అయి ఉండవచ్చు)... పల్లీలని, పల్లెకార్లని పిలిపించుకోవడానికి అభ్యంతరం ఏమిటని మాత్రం అనవద్దు. అటువంటివాళ్ళకి ఒకటే ప్రశ్న... నీచంగా భావం ధ్వనించేలా పల్లెకారు అని పిలిపించుకోవడం ఎందుకు? పల్లవులు అనే పిలిపించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయరు? అదైనా నాలుగు అక్షరాలే, ఇదైనా నాలుగు అక్షరాలే కదా! ఒకసారి ఆలోచించండి" అని సమాధానమిచ్చాము.
"అగ్నికులక్షత్రియ అభ్యుదయ మహాసంఘం" ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్తీకమాస వనభోజన మహోత్సవం కాస్తా మందిరభోజన మహోత్సవంగా మారి విజయవంతంగా ముగిసింది.
విచ్చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదములు.

20, జులై 2013, శనివారం

యువతకు విజ్ఞప్తి!


అగ్నికులక్షత్రియయువతకు విజ్ఞప్తి!

అగ్నికులక్షత్రియులను S.T.లలో చేర్చాలని గట్టిప్రయత్నము జరుగుతుంది. బెస్త, జాలరి, పల్లి మొదలగు 14 కులాలతో కలిసిన అగ్నికులక్షత్రియులు కోటిన్నరమంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. అందరూ 50, 60 సం||ల నుండి B.C.లలో ఉండి వారికి ప్రభుత్వము కల్పించు B.C.రిజర్వేషన్ వినియోగించుకొని లక్షలాది మంది అగ్నికులక్షత్రియులు అభివృద్ధి చెంది ఉంటారు. అయినా వారు బ్రతుకుతెరువు కొరకు చేపట్టిన వృత్తిలోనే కొనసాగుతూ వారి అభివృద్ధిని బాహ్యప్రపంచానికి తెలియకుండా దాచుకొని వారికి ప్రభుత్వం కల్పించిన B.C. రిజర్వేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనము కలగలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు రిజర్వేషన్స్ అమలులోకి రాకపూర్వము ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారన్నది ప్రస్తుతం ST రిజర్వేషన్ కొరకు పోరాడుతున్న వారి అభిప్రాయమా? లేదు.... BC రిజర్వేషన్ వల్ల ఎటువంటి అభివృద్ధి లేదు... STలలో చేరితేనే అభివృద్ధి ఉంటుంది అన్న అభిప్రాయమా? మరి BC రిజర్వేషన్ ఉపయోగించుకొని అభివృద్ధి చెందలేని వారు, సమాజంలో చిన్నచూపు చూడబడటానికి కారణమైన వారి వృత్తిని వదలలేనివారు రేపు ST రిజర్వేషన్ ఉపయోగించుకొని అభివృద్ధి చెందగలరని గ్యారెంటీ ఉందా? వారు - ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి ప్రస్తుతము వీటితోపాటు ఉభయ మీడియాలను, సినిమా, కళలు, సాహిత్యము, విద్య మొదలగు రంగాలను వారి గుత్తాధిపత్యము క్రింద నడుపుతున్న అగ్రకులాల సరసన నిలబెట్టగలరా? అబ్బెబ్బే! అంతలేదంటారేమో! మరి అభివృద్ధికి నిర్వచనమేమిటి? ప్రభుత్వమునుండి ఎటువంటి సహకారము అందుకోకుండా సమాజాన్ని శాసించే స్థితికి ఎదిగిన ప్రధాన కులాలు రెండింటిలోనూ - పుట్టిన ప్రతి ఒక్కడు పుడుతూనే నోట్లో బంగారుచెంచాతో పుట్టలేదు. పైగా వారి వృత్తి వ్యవసాయము ఒక్కటే. దాని ద్వారా బ్రిటిష్ పాలనాకాలంలో వారికి అందివచ్చిన చేయూతద్వారా వారు అభివృద్ధి చెందలేదా? ఇప్పుడు వారు ప్రభుత్వంనుండి ఏ సహకారమూ ఆశించడం లేదు. స్వయంకృషితో, స్వయంపోషకత్వంతో వారు అభివృద్ధి చెందారు. చెందుతున్నారు.
కాని అగ్నికులక్షత్రియులు వ్యవసాయము, నౌకాపరిశ్రమ, దానికి అనుబంధంగా ఉన్న వడ్రంగము, నౌకాయానము, విదేశీ నౌకా వ్యాపారము, కమ్మరము, శిల్పకళ మొదలగు అనేక వృత్తులలో ఉన్నారు. ఇవన్నీ వదిలేసి కులపెద్దలు కొందరు మన కులవృత్తి చేపలవేటగా నిర్ణయించి, అగ్నికులక్షత్రియులను ఆత్మన్యూనతకు లోనుచేసి ఆ వృత్తితో ఎటువంటి సంబంధమూ లేని అనేక వేల కుటుంబాలవారికి సమాజంలో విలువ లేకుండా చేశారు. అది చాలదన్నట్లు ప్రస్తుతము అగ్నికులక్షత్రియులను ST లలో చేర్పించి, చెంచు, సుగాలి, ఎరుకల, యానాది తదితర 35 కులాల సరసన కూర్చోబెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పరిణామ(మార్పు) క్రమంలో ఒక జీవి అభివృద్ధి దిశగా పయనించాలి. పతనంవైపు కాదు. కాని అగ్నికులక్షత్రియుల పూజ్యపెద్దలు ఒకప్పుడు OCలలో ఉన్న కులాన్ని BCలలోకి మార్పించారు. BCలలోకి మార్చడం వల్ల వారు ఆశించినది నెరవేరుతూనే ఉంది. అవసరమున్న వారు దాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నారు. అయినా BCరిజర్వేషన్ వల్ల ఆశించిన ఫలితం దక్కలేదనే నెపంతో మరలా STలలోకి మారడానికి కృషి మొదలుపెట్టారు పూజ్యపెద్దలు కొందరు.
అంతగా STలలో చేర్చడం తప్పనిసరి అయితే అగ్నికులక్షత్రియులుగాక మిగిలిన అసలు సిసలైన 14 మత్స్యకార కులాలను ST లలో చేర్చుటకు కృషిచేసి, పోరాడి సాధించవచ్చు. అగ్నికులక్షత్రియులను స్వయంకృషితో స్వయంపోషకత్వంతో అభివృద్ధి చెందునట్లు మార్గదర్శనం చేయవచ్చు. ఇందువల్ల వారు బ్రతుకుతెరువుకొరకు ఏర్పరుచుకున్న ఏ వృత్తినీ వదులుకోనక్కరలేదు. అందులోనే కొనసాగుతూ దివ్యమైన జీవితం గడుపుతూ, సమాజంలో వారు కోల్పోయిన విలువలను పునరుద్ధరించుకోవచ్చు.

అగ్నికులక్షత్రియ సోదరీ సోదరులారా! మేల్కొనండి!!

సమాజంలో అగ్నికులక్షత్రియులు కోల్పోయిన విలువల పునరుద్ధరణకు కృషిచేద్దాం రండి!!


నిస్వార్థంగా కృషిచేయగల నూరుమంది కలిస్తే కొండలను సైతం పిండిచేయవచ్చు . ఆలోచించండి!!!


....................................................................................................................................................................................................
ఒడుగు నరేష్ వర్మ - 9700472572