కరపత్రము - 2
చరిత్ర తెలియక విస్మృతికిలోనైన అమాయక అ.క్ష.లు తమ కులం పేరును పల్లెకారి అని చెప్తూ అది పల్లవ పదమునకు రూపాంతరమని వాదిస్తుంటారు. కాని పల్లవ అను పదమునకు పల్లెకారి అను పదమునకు పోలికే లేదు. ఈ పల్లెకారీనే పదము ఎట్లా ఏర్పడినదో ఎక్కడా చారిత్రకమైన ఆధారములు కనపడవు. కొందరు పళ్ళి అను పదమునకు మళయాళ భాషలోని రాజు అనే అర్థం తీసుకొని పల్లవులు రాజులు కనుక పల్లీలు అని పిలువబడినారు అంటారు. మళయాళంలోని పళ్ళి అంటే రాజు అన్న అర్థం పరిగణనలోకి తీసుకుంటే ఆ కాలంలో రాజ్యాలేలిన రాజవంశీకులందరూ పల్లీలు అని పిలువబడి ఉండాలి. కాని అది ఒక్క పల్లవ రాజ వంశీకులకే ఆపాదించబడింది. పైగా మళయాళ దేశమునేలిన కేరళులు అతి ప్రాచీనకాలమునుండియు పల్లవుల వలెనే స్వతంత్ర రాజులు. ఆ రెండు రాజవంశములు సమకాలీన వంశములు. మళయాళ భాషలోని పళ్ళి అను పదము పల్లిగా మారినదను వాదమును అంగీకరించుటకు పల్లవుల పాలన కాలంలో కేరళీయులకు, పల్లవులకుగల రాజకీయ సంబంధముగురించికాని, సామాజిక సంబంధ బాంధవ్యాల గురించిగాని, ఎక్కడో నైరుతి తీర ప్రాంతవాసులైన కేరళీయులు తూర్పుతీర ప్రాంతమునకు వలస వచ్చినట్లుగాగాని చారిత్రక ఆధారాలు కనిపించవు. అదే చాళుక్య, చోళ మైత్రి ఫలింతంగా ఆంధ్ర, తమిళ దేశాల మధ్య సంబంధబాంధవ్యాలు హెచ్చుగానే వుండేవని చారిత్రక ఆధారాలు కనిపించుచున్నవి. తెలుగు, తమిళ భాషలు ఒకే కూటమికి చెందినవి. రెండు భాషలలో కొన్ని అక్షరాల సామ్యము కూడ కనిపిస్తుంది. మళయాళంలోని పళ్ళి అను పదము పల్లి గా తీసుకుంటే మరి పల్లెకారి లేక పల్లికారి అనే పదము ఎట్లా ఏర్పడినదో అందులోని కారి అను అక్షరములు ఎందుకు కలిపారో, కారి అంటే అర్థమేమిటో ఎక్కడా వివరణ కనబడదు. ఒకవేళ విదేశీయులు కొన్ని నగరాలు, పట్టణాలు పేర్లు ఉచ్ఛారణను మార్చి వేరే వింధంగా అనగా... ఘంటసాల ను కొంటకొస్సలగాను, బందరు దగ్గర గూడూరుని కొడ్డూర అనియు, మోటుపల్లిని మోసలపురం అనియు పలికినట్లు పల్లెకారి అని వుంటారని చెప్పుటకు కూడా తగిన ఆధారాలు లేవు. దానికి మూలపదమేమిటో తెలియదు.
ఈ పల్లెకారి అనే పదమే అ.క్ష.లకు సమాజంలో సరియైన విలువలు లేకుండా పోవడానికిగల ప్రధాన కారణం. పల్లెకారి అనగానే చేపలు పట్టుకునేవాడుగా చూడబడతాడు. అ.క్ష.లు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన వారైనా ఈ పల్లెకారి అను పేరువల్ల సమాజంలో ఇతర బడుగు, బలహీన కులాలు, ఎటువంటి చారిత్రక నేపథ్యములేని కులాల వారికంటేకూడ చిన్నచూపు చూడబడతారు. కనుక అ.క్ష.లు తమను తాము కించపరుచుకొనే పల్లి అనిగాని పల్లెకారి అనిగాని చెప్పుకోవడంగాని, పిలిపించుకోవడంగాని సరైనది కాదు. ప్రభుత్వ ఉత్తర్వులలో కనిపించు పల్లి అను పేరు బెస్త, జాలరి, వాడబలిజ మొదలగు అనేక ఉపకులాల వలెనే ఒక ఉపకులమే అవుతుంది గాని అ.క్ష. కులమునకు మాత్రము పర్యాయపదంగా వర్తించదు.
కనుక అ.క్ష. సోదర మహాశయులు తమ కులము పేరు చెప్పవలసినచోట పల్లెకారి అని కాకుండా అగ్నికుల క్షత్రియ అని చెప్పవలసినదిగా మనవి.
1. అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులా?
కానే కాదు. కుల విభజనకు, కుల వౄత్తుల ఏర్పాటుకు మూలాధారంగా భావింపబడుచున్న అతి ప్రాచీన గ్రంథమైన మనుధర్మ శాస్త్రము 10 వ అ. 48 శ్లోకంలో మత్స్యఘాతో నిషాదానాం... నిషాదులకు చేపలు పట్టుట వృత్తి... అని చెప్పబడి ఉన్నది. అంతేకాని అది ఏ కులానికీ కుల వృత్తిగా ఆపాదింపబడలేదు.
అ.క్ష.లుగాక ఏ ఇతర కులాన్ని పరిశీలించినా సమాజానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిగాని, సేవా వృత్తులలో ఏదో ఒక వృత్తిలోగాని స్థిరపడి అందులోనే నిష్ణాతులై దానినే వారి వంశపరంపర కులవృత్తిగా చేసుకున్నారు. అటువంటి ఏ కులవృత్తికైనా ఆ కులములోని వారే అర్హులుగాని ఇతరులెవరూ ప్రవేశార్హులుకారు. ప్రాచీనకాలమునుండి వంశపరంపరకు సంబందములేని బహువృత్తినిపుణులు కలిగిన కులము అగ్నికుల క్షత్రియ కులము ఒక్కటే కనిపిస్తుంది. అందులో ప్రధానమైన వృత్తులు వ్యవసాయం, నౌకానిర్మాణం, నౌకాయానము... వాటికి అనుబంధమైన వడ్రంగము, కమ్మరము మొదలగు వృత్తులలో నిపుణులైనవారు అ.క్ష.లలో ఎందరో ఉన్నారు. వీటిలో నౌకానిర్మాణము, దానికి సంబంధించిన వడ్రంగం, నౌకాయానము అ.క్ష.లకే ప్రత్యేకము. ఏకొద్దిమందో పై వృత్తులనేర్పరచుకునే ఆర్థికస్థోమత లేని వారు, నిరక్షరాస్యులు వారి జీవనభౄతికొరకు మత్స్యకార వృత్తిని చేపట్టి ఉండవచ్చు. అంతమాత్రంచేత అ.క్ష.లందరూ వారు ఏ వృత్తిలో ఉన్నా మత్స్యకారులేనని, మత్స్యకారులందరూ అ.క్ష.లేననడం మాత్రము సహించరానిది. అట్లా అనినవారికి తగు విధంగా గుణపాఠం చెప్పాలి. మత్స్యకార వృత్తి అ.క్ష. కులమునకు కులవృత్తి కాదు. ఈ మత్స్యపరిశ్రమలో కొన్ని అగ్రకులాల వారితో సహా అనేక కులాలవారు, వారి కులవృత్తికి అనుబంధంగా ఈ వృత్తిని చేపట్టిన వారు ఉన్నారు. వారిని మత్స్యకారులు అనరు. ఆ వృత్తితో ఏ కాలంలోనూ, ఏటువంటి సంబంధము లేకుండా ఇతర వృత్తులలో, ఉద్యోగాలలో స్థిరపడి పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో నివసించుచూ ఆర్థికాభివౄద్ధి సాధించి గౌరవప్రదంగా జీవించుచున్న అ.క్ష.లు అధికశాతంలో ఉన్నారు. కులం పేరు పల్లెకారి అని చెప్పడంలో అ.క్ష.లు అధికసంఖ్యలో ఆత్మన్యూనతకు లోనై కులం పేరును మార్చుకునో, ఇంటిపేరుని వీలైన చోటల్లా మార్చుకునో వేరే కులస్తులుగా పరిగణనలోకి వస్తున్నారు. దానివల్ల కుల అస్తిత్వానికే భంగము వాటిల్లే ప్రమాదముంది.
కనుక అ.క్ష. సోదరులందరూ పై వివరణ దౄష్ట్యా దయచేసి కులమునకుగల పల్లి, పల్లికారి అను పేరును వీడి ఇకముందు కులం పేరును చెప్పవలసినచోటల్లా `అగ్నికుల క్షత్రియా అని చెప్పుకొని, అదే పేరుతో చలామణిలోకి వచ్చి కులమునకు పూర్వవైభవమును పునరుద్ధరించుకొనుటకు కృషి చేపట్టవలసినదిగా మనవి.
దీనివల్ల అ.క్ష.ల సామాజిక గుర్తింపు ఏ కొంచెము మార్పు అయినా సంభవించి వారు ఆత్మన్యూనతనుండి బయటపడవచ్చునేమోగాని వారు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలోగాని, వారి ఆర్థికస్థితిలోగాని అకస్మాత్తుగా ఏటువంటి మార్పుకు ఆస్కారము లేదు. కనుక ప్రస్తుతం ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధికి కల్పించుచున్న ఆర్థిక మరియు రిజర్వేషన్ మొదలగు సంక్షేమ పథకాలు అ.క్ష.లకు అందవేమోననే అనుమానం లేకుండా తమ ఔన్నత్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయవలసినదిగా కోరుకుందాము. ప్రస్తుతము ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అగ్నికుల క్షత్రియ అను పేరు మీదనే ప్రభుత్వము కల్పించు సదుపాయములు అమలు జరుగుచున్నవి కనుక ఈ విషయంలో అనుమానము అవసరములేదు.
సంఘటితశక్తికి ఏ లోకంలోనూ తిరుగులేదు. ఆ శక్తి మనకు కావాలి.
ఒకే జాతి, ఒకే మూలముయొక్క మనము ఒకే గమ్యమువైపు నడుద్దాము.
గమనిక : ఈ కరపత్రాన్ని పదిమందితో చదివించే ప్రయత్నం చేయండి.
చరిత్ర తెలియక విస్మృతికిలోనైన అమాయక అ.క్ష.లు తమ కులం పేరును పల్లెకారి అని చెప్తూ అది పల్లవ పదమునకు రూపాంతరమని వాదిస్తుంటారు. కాని పల్లవ అను పదమునకు పల్లెకారి అను పదమునకు పోలికే లేదు. ఈ పల్లెకారీనే పదము ఎట్లా ఏర్పడినదో ఎక్కడా చారిత్రకమైన ఆధారములు కనపడవు. కొందరు పళ్ళి అను పదమునకు మళయాళ భాషలోని రాజు అనే అర్థం తీసుకొని పల్లవులు రాజులు కనుక పల్లీలు అని పిలువబడినారు అంటారు. మళయాళంలోని పళ్ళి అంటే రాజు అన్న అర్థం పరిగణనలోకి తీసుకుంటే ఆ కాలంలో రాజ్యాలేలిన రాజవంశీకులందరూ పల్లీలు అని పిలువబడి ఉండాలి. కాని అది ఒక్క పల్లవ రాజ వంశీకులకే ఆపాదించబడింది. పైగా మళయాళ దేశమునేలిన కేరళులు అతి ప్రాచీనకాలమునుండియు పల్లవుల వలెనే స్వతంత్ర రాజులు. ఆ రెండు రాజవంశములు సమకాలీన వంశములు. మళయాళ భాషలోని పళ్ళి అను పదము పల్లిగా మారినదను వాదమును అంగీకరించుటకు పల్లవుల పాలన కాలంలో కేరళీయులకు, పల్లవులకుగల రాజకీయ సంబంధముగురించికాని, సామాజిక సంబంధ బాంధవ్యాల గురించిగాని, ఎక్కడో నైరుతి తీర ప్రాంతవాసులైన కేరళీయులు తూర్పుతీర ప్రాంతమునకు వలస వచ్చినట్లుగాగాని చారిత్రక ఆధారాలు కనిపించవు. అదే చాళుక్య, చోళ మైత్రి ఫలింతంగా ఆంధ్ర, తమిళ దేశాల మధ్య సంబంధబాంధవ్యాలు హెచ్చుగానే వుండేవని చారిత్రక ఆధారాలు కనిపించుచున్నవి. తెలుగు, తమిళ భాషలు ఒకే కూటమికి చెందినవి. రెండు భాషలలో కొన్ని అక్షరాల సామ్యము కూడ కనిపిస్తుంది. మళయాళంలోని పళ్ళి అను పదము పల్లి గా తీసుకుంటే మరి పల్లెకారి లేక పల్లికారి అనే పదము ఎట్లా ఏర్పడినదో అందులోని కారి అను అక్షరములు ఎందుకు కలిపారో, కారి అంటే అర్థమేమిటో ఎక్కడా వివరణ కనబడదు. ఒకవేళ విదేశీయులు కొన్ని నగరాలు, పట్టణాలు పేర్లు ఉచ్ఛారణను మార్చి వేరే వింధంగా అనగా... ఘంటసాల ను కొంటకొస్సలగాను, బందరు దగ్గర గూడూరుని కొడ్డూర అనియు, మోటుపల్లిని మోసలపురం అనియు పలికినట్లు పల్లెకారి అని వుంటారని చెప్పుటకు కూడా తగిన ఆధారాలు లేవు. దానికి మూలపదమేమిటో తెలియదు.
ఈ పల్లెకారి అనే పదమే అ.క్ష.లకు సమాజంలో సరియైన విలువలు లేకుండా పోవడానికిగల ప్రధాన కారణం. పల్లెకారి అనగానే చేపలు పట్టుకునేవాడుగా చూడబడతాడు. అ.క్ష.లు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన వారైనా ఈ పల్లెకారి అను పేరువల్ల సమాజంలో ఇతర బడుగు, బలహీన కులాలు, ఎటువంటి చారిత్రక నేపథ్యములేని కులాల వారికంటేకూడ చిన్నచూపు చూడబడతారు. కనుక అ.క్ష.లు తమను తాము కించపరుచుకొనే పల్లి అనిగాని పల్లెకారి అనిగాని చెప్పుకోవడంగాని, పిలిపించుకోవడంగాని సరైనది కాదు. ప్రభుత్వ ఉత్తర్వులలో కనిపించు పల్లి అను పేరు బెస్త, జాలరి, వాడబలిజ మొదలగు అనేక ఉపకులాల వలెనే ఒక ఉపకులమే అవుతుంది గాని అ.క్ష. కులమునకు మాత్రము పర్యాయపదంగా వర్తించదు.
కనుక అ.క్ష. సోదర మహాశయులు తమ కులము పేరు చెప్పవలసినచోట పల్లెకారి అని కాకుండా అగ్నికుల క్షత్రియ అని చెప్పవలసినదిగా మనవి.
1. అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులా?
కానే కాదు. కుల విభజనకు, కుల వౄత్తుల ఏర్పాటుకు మూలాధారంగా భావింపబడుచున్న అతి ప్రాచీన గ్రంథమైన మనుధర్మ శాస్త్రము 10 వ అ. 48 శ్లోకంలో మత్స్యఘాతో నిషాదానాం... నిషాదులకు చేపలు పట్టుట వృత్తి... అని చెప్పబడి ఉన్నది. అంతేకాని అది ఏ కులానికీ కుల వృత్తిగా ఆపాదింపబడలేదు.
అ.క్ష.లుగాక ఏ ఇతర కులాన్ని పరిశీలించినా సమాజానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిగాని, సేవా వృత్తులలో ఏదో ఒక వృత్తిలోగాని స్థిరపడి అందులోనే నిష్ణాతులై దానినే వారి వంశపరంపర కులవృత్తిగా చేసుకున్నారు. అటువంటి ఏ కులవృత్తికైనా ఆ కులములోని వారే అర్హులుగాని ఇతరులెవరూ ప్రవేశార్హులుకారు. ప్రాచీనకాలమునుండి వంశపరంపరకు సంబందములేని బహువృత్తినిపుణులు కలిగిన కులము అగ్నికుల క్షత్రియ కులము ఒక్కటే కనిపిస్తుంది. అందులో ప్రధానమైన వృత్తులు వ్యవసాయం, నౌకానిర్మాణం, నౌకాయానము... వాటికి అనుబంధమైన వడ్రంగము, కమ్మరము మొదలగు వృత్తులలో నిపుణులైనవారు అ.క్ష.లలో ఎందరో ఉన్నారు. వీటిలో నౌకానిర్మాణము, దానికి సంబంధించిన వడ్రంగం, నౌకాయానము అ.క్ష.లకే ప్రత్యేకము. ఏకొద్దిమందో పై వృత్తులనేర్పరచుకునే ఆర్థికస్థోమత లేని వారు, నిరక్షరాస్యులు వారి జీవనభౄతికొరకు మత్స్యకార వృత్తిని చేపట్టి ఉండవచ్చు. అంతమాత్రంచేత అ.క్ష.లందరూ వారు ఏ వృత్తిలో ఉన్నా మత్స్యకారులేనని, మత్స్యకారులందరూ అ.క్ష.లేననడం మాత్రము సహించరానిది. అట్లా అనినవారికి తగు విధంగా గుణపాఠం చెప్పాలి. మత్స్యకార వృత్తి అ.క్ష. కులమునకు కులవృత్తి కాదు. ఈ మత్స్యపరిశ్రమలో కొన్ని అగ్రకులాల వారితో సహా అనేక కులాలవారు, వారి కులవృత్తికి అనుబంధంగా ఈ వృత్తిని చేపట్టిన వారు ఉన్నారు. వారిని మత్స్యకారులు అనరు. ఆ వృత్తితో ఏ కాలంలోనూ, ఏటువంటి సంబంధము లేకుండా ఇతర వృత్తులలో, ఉద్యోగాలలో స్థిరపడి పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో నివసించుచూ ఆర్థికాభివౄద్ధి సాధించి గౌరవప్రదంగా జీవించుచున్న అ.క్ష.లు అధికశాతంలో ఉన్నారు. కులం పేరు పల్లెకారి అని చెప్పడంలో అ.క్ష.లు అధికసంఖ్యలో ఆత్మన్యూనతకు లోనై కులం పేరును మార్చుకునో, ఇంటిపేరుని వీలైన చోటల్లా మార్చుకునో వేరే కులస్తులుగా పరిగణనలోకి వస్తున్నారు. దానివల్ల కుల అస్తిత్వానికే భంగము వాటిల్లే ప్రమాదముంది.
కనుక అ.క్ష. సోదరులందరూ పై వివరణ దౄష్ట్యా దయచేసి కులమునకుగల పల్లి, పల్లికారి అను పేరును వీడి ఇకముందు కులం పేరును చెప్పవలసినచోటల్లా `అగ్నికుల క్షత్రియా అని చెప్పుకొని, అదే పేరుతో చలామణిలోకి వచ్చి కులమునకు పూర్వవైభవమును పునరుద్ధరించుకొనుటకు కృషి చేపట్టవలసినదిగా మనవి.
దీనివల్ల అ.క్ష.ల సామాజిక గుర్తింపు ఏ కొంచెము మార్పు అయినా సంభవించి వారు ఆత్మన్యూనతనుండి బయటపడవచ్చునేమోగాని వారు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలోగాని, వారి ఆర్థికస్థితిలోగాని అకస్మాత్తుగా ఏటువంటి మార్పుకు ఆస్కారము లేదు. కనుక ప్రస్తుతం ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధికి కల్పించుచున్న ఆర్థిక మరియు రిజర్వేషన్ మొదలగు సంక్షేమ పథకాలు అ.క్ష.లకు అందవేమోననే అనుమానం లేకుండా తమ ఔన్నత్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయవలసినదిగా కోరుకుందాము. ప్రస్తుతము ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అగ్నికుల క్షత్రియ అను పేరు మీదనే ప్రభుత్వము కల్పించు సదుపాయములు అమలు జరుగుచున్నవి కనుక ఈ విషయంలో అనుమానము అవసరములేదు.
సంఘటితశక్తికి ఏ లోకంలోనూ తిరుగులేదు. ఆ శక్తి మనకు కావాలి.
ఒకే జాతి, ఒకే మూలముయొక్క మనము ఒకే గమ్యమువైపు నడుద్దాము.
గమనిక : ఈ కరపత్రాన్ని పదిమందితో చదివించే ప్రయత్నం చేయండి.